ఏడేళ్లలో 8.81 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-15T03:30:35+05:30 IST

గత ఏడేళ్లలో 8.81 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు తరలిపోయారని కేంద్రం మంగళవారం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటించింది. విదేశాంగ శాఖ తాజా లెక్కల ప్రకారం.. గత ఏడేళ్లలో 8,81,254 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో..

ఏడేళ్లలో 8.81 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారు: కేంద్రం

న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో 8.81 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు తరలిపోయారని కేంద్రం మంగళవారం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటించింది. విదేశాంగ శాఖ తాజా లెక్కల ప్రకారం.. గత ఏడేళ్లలో 8,81,254 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కాగా.. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో లక్ష మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం గత నెలలోనే ప్రకటించింది. ఇలా విదేశాలకు శాశ్వతంగా తరలిపోతున్న వారిలో అధిక శాతం మంది అపరకుబేరులేనని తెలుస్తోంది. అయితే.. ఈ ‘వలసలకు’ కారణమేంటనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 

Updated Date - 2021-12-15T03:30:35+05:30 IST