వందే భారత్ మిషన్: యూఏఈ నుంచి స్వదేశానికి చేరిన 2.75లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-08-03T16:16:27+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని యూఏఈలోని భారత కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. ఈ

వందే భారత్ మిషన్: యూఏఈ నుంచి స్వదేశానికి చేరిన 2.75లక్షల మంది భారతీయులు!

అబుధాబి: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని యూఏఈలోని భారత కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా.. ఇప్పటి వరకు 2.75లక్షల మంది ప్రవాసులు.. ఇండియాకు చేరుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి దాదాపు 5లక్షల మంది ప్రవాసులు.. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. యూఏఈలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు దుబాయి, షార్జాల నుంచి ఇండియాలోని ప్రధాన నగరాలకు దాదాపు 90.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ విమానాలు ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనున్నట్లు కాన్సులేట్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇవే కాకుండా ఎయిర్ అరబ్, ఎమిరేట్స్, స్పైస్‌జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 100 విమానాలను.. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2020-08-03T16:16:27+05:30 IST