కరెంట్ పోల్ మీద పడి ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-08-07T23:08:24+05:30 IST
వేమూరు రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తుండగా క్రేన్ వైర్
గుంటూరు: వేమూరు రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తుండగా క్రేన్ వైర్ తెగింది. దీంతో పోల్ మీద పడి ఒకరు మృతి చెందారు. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న షేక్ కోమల్ కాంత్(20) ఈ ఘటనలో చనిపోయాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.