ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి విల‌యం !

ABN , First Publish Date - 2020-07-11T17:04:17+05:30 IST

ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా విల‌యం కొన‌సాగుతోంది.

ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి విల‌యం !

మ‌స్క‌ట్‌: ఒమ‌న్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా విల‌యం కొన‌సాగుతోంది. రోజురోజుకు పంజా విసురుతున్న ఈ వైర‌స్ వ‌ల్ల‌ అంత‌కంత‌కు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్ర‌వారం ఒక్క‌రోజే ఒమ‌న్‌లో 1,889 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో క‌రోనా సోకిన వారి సంఖ్య 1,889కు  చేరింది. ఇక నిన్న‌టి కొత్త కేసుల్లో 1268 మంది ఒమ‌న్ పౌరులుంటే.. మిగ‌తా 621 మంది విదేశీయులు ఉన్నారు. అయితే, నిన్న ఒకేరోజు 1,204 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమ‌న్ వ్యాప్తంగా మొత్తం 34,225 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్ప‌టికే ఆ దేశం‌లో క‌రోనా కాటుకు బ‌లైన వారు 244 మంది అయ్యారు. ఇదిలా ఉంటే... వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విరుచుకుప‌డుతున్న‌ ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5.60 లక్ష‌ల మందిని క‌బ‌ళించింది. కోటి 26 ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది.  

Updated Date - 2020-07-11T17:04:17+05:30 IST