Oman: ప్రవాసులకు పండగలాంటి వార్త!
ABN , First Publish Date - 2022-04-03T14:55:51+05:30 IST
గల్ఫ్ దేశం ఒమన్ ప్రవాసులకు తీపి కబురు చెప్పింది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ ప్రవాసులకు తీపి కబురు చెప్పింది. 2022 మార్చి 31తో గడువు తీరిన ప్రవాసుల వర్క్ పర్మిట్ల గ్రేస్ పీరియడ్ను పొడిగించింది. ఈ మేరకు ఆ దేశ కార్మిక మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. "ప్రైవేట్ రంగ సంస్థలకు వారి పనితీరుపై మహమ్మారి ప్రభావాలను తగ్గించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ అందించే సౌకర్యాలలో భాగంగా కార్మిక మంత్రిత్వ శాఖ గడువు ముగిసిన ఒమానీయేతర కార్మికుల వర్క్ పర్మిట్ల చెల్లుబాటును పొడిగిస్తూ గ్రేస్ పీరియడ్ను పొడిగించింది. మార్చి 31, 2022 నుండి జూన్ 30, 2022 వరకు పెంచిన గడువు వర్తిస్తుంది" అని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రవాసులు, ఆ దేశంలోని ప్రైవేట్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.