పి.వి.సింధును సత్కరించిన కేంద్ర మంత్రులు

ABN , First Publish Date - 2021-08-04T01:58:15+05:30 IST

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌-2020 బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించిన పి.వి.సింధును, ఆమె కోచ్‌ పార్క్‌ టే శాంగ్‌ను కేంద్ర మంత్రులు న్యూ‌ఢిల్లీలో ఘనంగా సన్మానించారు.

పి.వి.సింధును సత్కరించిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌-2020 బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించిన పి.వి.సింధును, ఆమె కోచ్‌ పార్క్‌ టే శాంగ్‌ను కేంద్ర మంత్రులు న్యూ‌ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సాంస్కృతిక-పర్యాటక, ఈశాన్యభారత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తదితరులు సత్కరించారు. “భారత అత్యంత గొప్ప ఒలింపియన్లలో పి.వి.సింధు కూడా ఒకరని, దేశం తరఫున ఆడాలని పరితపించే భారత క్రీడాకారులందరికీ ఆమె ఆదర్శమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. సెమీఫైనల్స్‌ చేరడంలో వైఫల్యంపై నిరాశ చెందినప్పటికీ ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించడం ఎంతో సంతోషం కలిగించిందని సింధు అన్నారు. తన కోసం ఎన్నో త్యాగాలు చేయడంతోపాటు నిరంతరం మద్దతునిచ్చిన తల్లిదండ్రులకు, తన కల నిజమయ్యేలా సదా తోడ్పాటునిచ్చిన కోచ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సింధు చెప్పారు. కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.   

Updated Date - 2021-08-04T01:58:15+05:30 IST