అధికారికంగా.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-09-27T08:48:18+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం(27న) ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం(27న) ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. ఈ వేడుకల కోసం రాష్ట్ర స్థాయి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఎల్.రమణ, చైర్మన్గా సీహెచ్.ప్రభాకర్ను.. అలాగే, ముఖ్య సలహాదారులు, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లను నియమించింది. 27న ఉదయం 10 గంటల నుంచి నగరంలోని రవీంద్ర భారతిలో జయంతి వేడుకులను నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బీ.వెంకటేశం తెలిపారు.