థియేటర్లో అధికారుల దాడులు
ABN , First Publish Date - 2021-12-23T23:52:40+05:30 IST
హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రదర్శించే గౌరీ
అనంతపురం: హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రదర్శించే గౌరీ థియేటర్లో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు చేశారు. క్యాంటీన్లో తినుబండారాలను అధికారులు తూకం వేశారు. నాణ్యతను పరిశీలించడానికి శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్టు అధికారులు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది అంటూ నాని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు.