సోషల్ మీడియాలో మైలవరం ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు

ABN , First Publish Date - 2022-02-16T21:52:36+05:30 IST

సోషల్ మీడియాలో మైలవరం ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులను

సోషల్ మీడియాలో మైలవరం ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు

కృష్ణా: సోషల్ మీడియాలో మైలవరం ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులను పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సీఎం జగన్ కొట్టినట్లు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కొందరు వ్యక్తులు పెట్టారు. దీంతో మైలవరం పీఎస్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకుడు నవీన్‌చౌదరి ఈ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని మైలవరం ఎస్ఐ రాంబాబు తెలిపారు. 


Updated Date - 2022-02-16T21:52:36+05:30 IST