ఏడాది సీఎంగా కేటీఆర్ మిగిలిపోతారు: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్

ABN , First Publish Date - 2021-01-21T19:27:23+05:30 IST

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ తెలిపారు. నేడు ఆయన హైదరాబాద్‌లో

ఏడాది సీఎంగా కేటీఆర్ మిగిలిపోతారు: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ డిమాండ్ చేశారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జయేష్ రంజన్, నర్సింహారెడ్డిలతో కలిసి కేటీఆర్ పారిశ్రామిక భూములపై కన్నేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబం, మిత్రుల పరిశ్రమలకే రాయితీలు ఇస్తున్నారన్నారు. అశోక్ లేలాండ్స్, హైదరాబాద్ డిస్టీలరీ, మోడెర్న్ బేకరీని కొన్నది కేటీఆర్ మిత్రులేనన్నారు. కేసీఆర్ అసమర్థుడు కాబట్టే కేటీఆర్‌ను సీఎం చేయాలంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కనుమరుగవటం ఖాయమని.. ఏడాది సీఎంగా కేటీఆర్ మిగిలిపోతారన్నారు. తహశీల్దార్‌పై దాడి చేసిన కేకే కూతురిపై చర్యలు తీసుకోవాలన్నారు. దాడి వెనుక కుట్ర ఉందని.. మియాపూర్ ల్యాండ్ అంశంలో కేకే పాత్ర ఉందని ప్రభాకర్ విమర్శించారు. 


Updated Date - 2021-01-21T19:27:23+05:30 IST