నుమాయిష్-2022 ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-02T00:52:50+05:30 IST

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2022ను తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

నుమాయిష్-2022 ప్రారంభం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2022ను తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన కొనసాగనుంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మైదానంలో కేవలం 1500 స్టాళ్లకు మాత్రమే అనుమతులిచ్చారు. 46 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో చిన్నారులను అలరించడానికి 16 రకాల గేమ్స్‌ రైడర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మైదానంలోకి సందర్శకులను వాహనాలతో అనుమతిస్తారు. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్ర వాహనానికి రూ.100 రుసుంగా పేర్కొన్నారు. వాహనదారులు మైదానమంతటా తిరిగి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. 

Updated Date - 2022-01-02T00:52:50+05:30 IST