NTR: దివ్యాంగుల సేవాసంస్థ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

ABN , First Publish Date - 2022-06-15T15:30:08+05:30 IST

దివ్యాంగుల సేవా సంస్థ ముసుగులో అసాంఘికా కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

NTR: దివ్యాంగుల సేవాసంస్థ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

ఎన్టీఆర్: దివ్యాంగుల సేవా సంస్థ ముసుగులో అసాంఘికా కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వసంతకుమారి అనే మహిళ 50 మంది దివ్యాంగులతో అన్నమ్మ దివ్యాంగుల సేవా సంస్థను నడిపిస్తోంది. అయితే నిర్వాహకురాలి భర్త వెంకటేశ్వరరావు సేవా సంస్థ ముసుగులో బాలికలను లైంగికంగా ఇబ్బందులకు గురిచేశాడు. వెంకటేశ్వరరావు వేధింపులు శృతి మించడంతో బాలికలు అధికారులకు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకురాలు భర్త వెంకటేశ్వరవు  తమను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నట్లు అధికారులతో బాలికలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. వెంటనే పోలీసులు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా సంస్థ నిర్వాహకురాలు వసంతకుమారి అందుబాటులో లేకుండా పోయారు. గత 20 సంవత్సరాలుగా వసంతకుమారి సంస్థను నడుపుతోంది. ఈ క్రమంలో అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో హాస్టల్‌లో 15 మంది బాలికలు ఉన్నట్లు  సమాచారం. నిందితుడు వెంకటేశ్వరరావు వి.టి.పి.ఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 

Updated Date - 2022-06-15T15:30:08+05:30 IST