రాజధాని రైతులకు సౌదీ అరేబియాలోని ప్రవాసీయుల మద్దతు

ABN , First Publish Date - 2020-07-04T23:07:26+05:30 IST

రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు చేస్తున్న పోరాటానికి గల్ఫ్ దేశాల నుంచి

రాజధాని రైతులకు సౌదీ అరేబియాలోని ప్రవాసీయుల మద్దతు

అల్ ఖొబర్: రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు చేస్తున్న పోరాటానికి గల్ఫ్ దేశాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులుకు చేరుకున్న సందర్భంలో వివిధ దేశాల్లోని ప్రవాసీయుల నుంచి రైతులకు మద్దతు భారీగానే వస్తుందని చెప్పాలి. తాజాగా సౌదీ అరేబియాలోని ఖొబర్ ప్రాంతంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులే కాకుండా తెలంగాణ ప్రాంత వాసులు కూడా రాజధాని రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖొబర్ ప్రాంతంలోని ప్రవాసులు ప్లకార్డులు ప్రదర్శించి తమ మద్దతును తెలియజేశారు. మరోపక్క దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రవాసులు రైతులకు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధానికి తమ సంపూర్ణ మద్దతు ఉందని వారు పేర్కొన్నారు.



Updated Date - 2020-07-04T23:07:26+05:30 IST