ఎన్నారై టీఆర్ఎస్.. సాగర్ ఉప ఎన్నిక ప్రచార కరపత్రం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-04-08T17:39:35+05:30 IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం ప్రచారం నిర్వహించడానికి ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకలు నియోజకవర్గానికి చేరుకున్నట్టు ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టముక్కల తెలిపారు.

ఎన్నారై టీఆర్ఎస్.. సాగర్ ఉప ఎన్నిక ప్రచార కరపత్రం ఆవిష్కరణ

హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థి నోముల భగత్,ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టముక్కల బృందం

లండన్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం ప్రచారం నిర్వహించడానికి ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకలు నియోజకవర్గానికి చేరుకున్నట్టు ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టముక్కల తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయాలతో కూడిన కరపత్రాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్, అభ్యర్థి నోముల భగత్, స్థానిక నాయకులు కోటి రెడ్డి ఇతర నాయకులు నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభా వేదికపై ఆవిష్కరించారు.


సతీష్ రెడ్డి గొట్టముక్కల మాట్లాడుతూ.. ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం దాదాపు పది సంవత్సరాలకు పైగా నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు ప్రతీ ఎన్నికల్లో అటు సోషల్ మీడియా ద్వారా, ఇటు క్షేత్రస్థాయిలో పర్యటించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అదే బాధ్యతతో నేడు నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో సైతం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని గడప గడపకు తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించామని చెప్పారు. నేడు దాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థి నోముల భగత్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని సతీష్ తెలిపారు.


ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి సందేశం

నోముల నర్సయ్య ఆశయాలను తన తనయుడు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందుకు తీసుకెళ్తాడానే నమ్మకం మాకుందని, యువ నాయకుడికి అవకాశం కలిపించినందుకు కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే కరపత్రాన్ని ఆవిష్కరించి అన్ని సందర్భాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థి నోముల భగత్‌లకు అశోక్ గౌడ్ తన సందేశం ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు.


మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి లండన్ కేంద్రంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ పార్టీకి అన్ని రకాలుగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. అటు సాధారణ ఎన్నికల్లో మరియు ఉప-ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బృందంగా వచ్చి ప్రచారం నిర్వహించడం ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ పట్ల వారికున్న అభిమానం చాలా గొప్పదని అన్నారు. పార్టీ గెలుపుకోసం విన్నూతంగా కరపత్రాలను ముద్రించి ప్రచారం నిర్వహిస్తున్నందుకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులను అభినందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ తన గెలుపు కోసం మండుటెండలో ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. తన తండ్రి నోముల నర్సయ్య పట్ల వీరికున్న గౌరవానికి అలాగే తన విజయానికై ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.


ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రాజ్ కుమార్ శానబోయిన, సత్య చిలుముల, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల, పృథ్వి రావుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారని సతీష్ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ ప్రజలంతా అభివృద్ధికి ఓటేసి తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు ఎంసీ కోటి రెడ్డి, కొండా సైదులు, గోపనబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

Updated Date - 2021-04-08T17:39:35+05:30 IST