అమెరికాలో పీవీ విగ్రహం: మహేశ్ బిగాల
ABN , First Publish Date - 2022-01-04T12:53:24+05:30 IST
అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆహ్వానించారు.
హైదరాబాద్: అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆహ్వానించారు. సోమవారం కవితను ఆమె నివాసంలో కలిసి పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మే నెలలో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.