నగదు లేకున్నా ‘చలో’!

ABN , First Publish Date - 2020-02-20T10:12:10+05:30 IST

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో ఏపీఎ్‌సఆర్టీసీ ‘చలో కార్డు’ ప్రవేశ పెట్టింది. ప్రయాణికులు ఈ కార్డు కొనుగోలు చేసి రీచార్జ్‌ చేసుకుంటే...

నగదు లేకున్నా ‘చలో’!

  • చలో కార్డుతో ఆర్టీసీలో నగదు రహిత ప్రయాణం: ఎండీ


అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో ఏపీఎ్‌సఆర్టీసీ ‘చలో కార్డు’ ప్రవేశ పెట్టింది. ప్రయాణికులు ఈ కార్డు కొనుగోలు చేసి రీచార్జ్‌ చేసుకుంటే బస్సు ప్రయాణంలో ‘ఈ-టికెట్‌’ తీసుకోవచ్చు. విజయవాడ పరిధిలో తిరుగుతున్న 436 బస్సుల్లో ఈ విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశ పెట్టారు.


నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘చలో కార్డు’ను ప్రవేశ పెట్టిన ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం  పాలనాపరమైన రాజధాని కాబోతున్న తరుణంలో కొత్తగా 100 మల్టీ యాక్సిల్‌ బస్సులు కొనుగోలు చేసి అన్ని జిల్లాల కేంద్రాల నుంచి విశాఖకు నడిపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అమరావతి బస్సులున్నట్లు కొత్త బస్సులకు ‘డాల్ఫిన్‌ క్రూయిజ్‌’ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Updated Date - 2020-02-20T10:12:10+05:30 IST