8 నుంచి ఓటుకు నోటు కేసు తుది విచారణ
ABN , First Publish Date - 2021-03-02T12:29:13+05:30 IST
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తుది విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ నెల 8న ప్రారంభం కానుంది. 8న కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తుది విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ నెల 8న ప్రారంభం కానుంది. 8న కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారు స్టిఫెన్సన్కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సోమవారం నాటి విచారణలో నిందితుల ఫోన్ రికార్డింగ్, డీవీఆర్లను దర్యాప్తు అధికారులు కోర్టుకు అందజేశారు. కోర్టుకు ఏంపీ రేవంత్రెడ్డి, సహ నిందితులు హాజరయ్యారు.