నిడమనూరులో నామినేషన్ వేసిన నోముల భగత్
ABN , First Publish Date - 2021-03-30T19:56:02+05:30 IST
సీఎం కేసీఆర్ నాకు జన్మలో మరిచిపోలేని అవకాశం ఇచ్చారని నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ వ్యాఖ్యానించారు.
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నిడమనూరు ఆర్వో కార్యాలయంలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం నోముల భగత్ మీడియాతో మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్ జన్మలో మరిచిపోలేని అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ‘‘ కేసీఆర్ మా నాన్నకు పార్టీలో సముచిత స్థానం కల్పించారన్నారు. 2018లో సాగర్ ప్రజలు మా నాన్న నోముల నర్సింహయ్యను ఆదరించి గెలిపించారు, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేశారని చెప్పారు. నెల్లికల్లు, కుంకుడు చెట్టు తండా లిఫ్ట్లు నిర్మాణమవుతున్నాయన్నారు. మా నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తా’’ అని నోముల భగత్ పేర్కొన్నారు. భగత్ నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్రెడ్డి, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డితో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.