ఎక్కడా పీపీఈ, మాస్కుల కొరత లేదు: కన్నబాబు
ABN , First Publish Date - 2020-04-10T19:09:25+05:30 IST
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కన్నబాబు తెలిపారు.
అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా పీపీఈ, మాస్కుల కొరత లేదన్నారు. అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని పంటలకూ మద్దతు ధర కేటాయిస్తామాన్నారు. మొక్కజొన్న, జొన్న ఎంఎస్పీకే కొనేందుకు కేంద్రం సహకరించాలన్నారు. రైతులను దళారులు మోసం చేస్తే సహించేది లేదని కన్నబాబు తెలిపారు.