మా డిమాండ్లలో మార్పు లేదు: స్టీరింగ్‌ కమిటీ

ABN , First Publish Date - 2022-02-05T02:17:09+05:30 IST

పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లలో మార్పుమీ లేదని స్టీరింగ్‌

మా డిమాండ్లలో మార్పు లేదు: స్టీరింగ్‌ కమిటీ

అమరావతి: పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లలో మార్పుమీ లేదని స్టీరింగ్‌ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఉద్యోగుల మూడు డిమాండ్లపై స్పందిస్తేనే చర్చలు ముందుకెళ్తాయని వారు పేర్కొన్నారు. లేకపోతే తమ కార్యాచరణ తమకుందని ఏబీఏన్‌తో స్టీరింగ్‌ కమిటీ పేర్కొంది. 'చలో విజయవాడ' కార్యక్రమంతో ప్రభుత్వం మనసు మార్చిందని తాము అనుకోవడం లేదన్నారు. చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నామని ఏబీఏన్‌తో స్టీరింగ్‌ కమిటీ తెలిపింది. రేపు కూడా చర్చలు కొనసాగించాలనుకుంటే వస్తామన్నారు. పీఆర్సీతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, సీపీఎస్ రద్దు సహా అన్ని డిమాండ్లు ప్రధానమైనవేనని ఏబీఏన్‌తో స్టీరింగ్‌ కమిటీ పేర్కొంది. 


Updated Date - 2022-02-05T02:17:09+05:30 IST