Telangana news: నిజాంసాగర్ ప్రాజెక్ట్లో కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2022-07-20T16:53:09+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamabad project)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamabad project)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్లోకి 3500 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1401.42 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 12.978 టీఎంసీలుగా కొనసాగుతోంది.