కోమాలో లేను... బాగానే ఉన్నా
ABN , First Publish Date - 2022-06-01T15:15:40+05:30 IST
తాను కోమాలో లేనని, బ్రతికే ఉన్నానని, రోజూ సమాధి స్థితికి చేరుకుంటున్నానని వివాదాస్పద స్వామి నిత్యానంద ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోస్ట్ ఈక్విడార్ సమీపంలోని ఓ దీవిని
- నిత్యానంద
చెన్నై: తాను కోమాలో లేనని, బ్రతికే ఉన్నానని, రోజూ సమాధి స్థితికి చేరుకుంటున్నానని వివాదాస్పద స్వామి నిత్యానంద ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోస్ట్ ఈక్విడార్ సమీపంలోని ఓ దీవిని కొనుగోలు చేసుకుని కైలాసదేశంగా పేరుపెట్టుకుని శిష్యులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నిత్యానంద కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు సామాజిక ప్రసార మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించాయి. నిత్యానంద రోజూ తన సందేశాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టేవారు. ఇటీవలి కాలంలో ఎలాంటి సందేశాలు రాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని భావించారు. ఈ నేపథ్యంలో నిత్యానంద తాజాగా ట్విట్టర్లో ఓ సందేశం విడుదల చేశారు. తాను కోమాలో లేనని బ్రతికే ఉన్నానని, త్వరలో పూర్తిగా కోలుకుని భక్తులు ముందుకు వస్తానని పేర్కొన్నారు. ఆహారం సక్రమంగా తీసుకోకుండా తరచూ సమాధిలోకి వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దని భక్తులకు సందేశమిచ్చారు.