సిలికానాంధ్ర యూనివర్సిటీ నిర్వాహకులను అభినందించిన నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2022-04-25T13:06:53+05:30 IST

అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ మంత్రుల సమావేశం జరిగింది. భారత్ తరఫున ఈ సమావేశానికి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌

సిలికానాంధ్ర యూనివర్సిటీ నిర్వాహకులను అభినందించిన నిర్మలా సీతారామన్

ఎన్నారై డెస్క్: అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ మంత్రుల సమావేశం జరిగింది. భారత్ తరఫున ఈ సమావేశానికి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి, శ్యామా శాస్త్రిల పెద్ద పెద్ద చిత్రపటాలు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉండడం గమనించిన నిర్మలా సీతారామన్.. ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆ మహనీయుల్లో ఒక్కొక్కరి గొప్పదనం గురించి ఆహూతులకు అద్భుతంగా వివరించారు. భారతీయ కళల సంరక్షణకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ నిర్వాహకులను ఎంతగానో అభినందించారు.




Updated Date - 2022-04-25T13:06:53+05:30 IST