మతాలను రెచ్చగొట్టే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలి: Niranjan

ABN , First Publish Date - 2022-06-29T18:15:21+05:30 IST

మతాలవారీగా విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు.

మతాలను రెచ్చగొట్టే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలి: Niranjan

హైదరాబాద్: మతాలవారీగా విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ (Niranjan) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతాలను రెచ్చగొట్టే వారిపైన, ఆ పార్టీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా బీజేపీ చేస్తున్న ఫోటో ఎక్సబిషన్‌లో రజాకార్ల ఆగడాలను ఫోటోలలో ప్రదర్శిస్తామని ఒక బీజేపీ నేత చెప్పారన్నారు. దానితో పాటు పోలీసు యాక్షన్ జరిగిన ఫోటోలు కూడా ప్రదర్శించాలని అన్నారు. 70 ఏళ్ల కింద జరిగిన అంశాలను, మరిచిపోయిన సంఘటనలను రేకేతించి యువతను రెచ్చగొట్టొద్దని నిరంజన్ హితవుపలికారు. 

Updated Date - 2022-06-29T18:15:21+05:30 IST