లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా కాలక్షేపం దేనికి?: నిమ్మల

ABN , First Publish Date - 2020-10-30T16:22:29+05:30 IST

టీడీపీ హయాంలో నిర్మించిన 8 లక్షల టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ‘నా ఇల్లు-నా సొంతం’ పోస్ట్‌కార్డుల ప్రజా ఉద్యమం

లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా కాలక్షేపం దేనికి?: నిమ్మల

ఏలూరు: టీడీపీ హయాంలో నిర్మించిన 8 లక్షల టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ‘నా ఇల్లు-నా సొంతం’ పోస్ట్‌కార్డుల ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడారు. ఇళ్లు స్వాధీనం చేయడం లేదా?.. రూ.3 వేలు అద్దె చెల్లించాలన్నారు. ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశంలో.. పేదల ఇళ్ల నిర్మాణం పాతాళంలో ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్‌తో ఇళ్లను లబ్ధిదారులకు చేరకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని నిమ్మల మండిపడ్డారు.

Updated Date - 2020-10-30T16:22:29+05:30 IST