మళ్లీ బాధ్యతలు తీసుకుంటున్నాను.. రమేశ్ కుమార్
ABN , First Publish Date - 2020-05-29T19:14:04+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకుంటున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకుంటున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. నగరంలోని ప్రశాసన్ నగర్లో ఉన్న తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు... రాజ్యాంగ సంస్థలు, విలువలు శాశ్వతమని రమేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారిపై... వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుందని రమేశ్ అన్నారు.