పతకాలు ఖాయం చేసుకున్న నిఖత్, హుసాముద్దీన్
ABN , First Publish Date - 2022-08-04T08:55:37+05:30 IST
తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ అంచనాలను నిలబెట్టుకుంటూ సెమీఫైనల్కు దూసుకుపోయారు...
తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ అంచనాలను నిలబెట్టుకుంటూ సెమీఫైనల్కు దూసుకుపోయారు. మహిళల లైట్ఫ్లైవెయిట్లో వరల్డ్ చాంపియన్ నిఖత్ క్వార్టర్ఫైనల్లో 5-0తో హాలెన్ జోన్స్ (వేల్స్)పై ఘన విజయం సాధించింది. దాంతో సెమీ్సకు చేరడం ద్వారా బాక్సింగ్లో మరో పతకాన్ని జరీన్ ఖాయం చేసింది. పురుషుల ఫెదర్వెయిట్లో హుసాముద్దీన్ కూడా జోరు కొనసాగిస్తున్నాడు. క్వార్టర్ఫైనల్లో 28 ఏళ్ల హుసాముద్దీన్ 4-1తో ట్రియగైన్ మార్నింగ్ (నమీబియా)ను చిత్తు చేశాడు. గత గోల్డ్కోస్ట్ గేమ్స్లోనూ హుసాముద్దీన్ రజత పతకం సాధించాడు. ఇక, మహిళల 48 కిలోల విభాగంలో నీతూ గంఘాస్ కూడా సెమీ్సలో అడుగుపెట్టి ఇంకో పతకం ఖరారు చేసింది. క్వార్టర్ఫైనల్లో 21 ఏళ్ల నీతు నికోల్ క్లైడ్ (నార్తర్న్ ఐర్లాండ్)పై విజయం సాధించింది.