నెక్స్ట్వేవ్కు రూ.21 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2021-12-02T06:19:18+05:30 IST
హైదరాబాద్కు చెందిన ఎడ్యుటెక్ స్టార్టప్ నెక్స్ట్వేవ్ 28 లక్షల డాలర్ల (దాదా పు రూ.21 కోట్లు) నిధులు సమీకరించింది.....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన ఎడ్యుటెక్ స్టార్టప్ నెక్స్ట్వేవ్ 28 లక్షల డాలర్ల (దాదా పు రూ.21 కోట్లు) నిధులు సమీకరించింది. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు ఫండింగ్ రౌండ్ కింద ఈ నిధులు అందించినట్లు నెక్స్ట్వేవ్ సీఈఓ రాహుల్ తెలిపారు. ఓరియస్ వెంచర్, బెటర్ క్యాపిటల్, కార్ధేకోకు చెందిన ఉమంగ్ కుమార్ ఈ పెట్టుబడులు పెట్టారు. తాజాగా లభించిన నిధులను ప్రొడక్ట్ డెవల్పమెంట్, నియామకాలు, విస్తరణ కార్యక్రమాలకు వినియోగిస్తారు. నెక్స్ట్వేవ్ను శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెద్రాల, రాహుల్ అట్లూరి స్థాపించారు. స్థానిక భాషల్లో కాలేజీ విద్యార్థులు ఇతరులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్లను నెక్స్ట్వేవ్ నిర్వహిస్తోంది.