హమ్మయ్య.. విలియమ్సన్ ఔట్.. ఈసారి దెబ్బకొట్టిన ఇషాంత్

ABN , First Publish Date - 2021-06-23T02:07:02+05:30 IST

న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన విలియమ్సన్

హమ్మయ్య.. విలియమ్సన్ ఔట్.. ఈసారి దెబ్బకొట్టిన ఇషాంత్

సౌతాంప్టన్: న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన విలియమ్సన్ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు ముందు ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగులో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 177 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ ఆరు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఈ వికెట్‌తో ఇషాంత్ ఖాతాలో  మూడు వికెట్లు చేరాయి. అంతకుముందు కాన్వే (54), హెన్రీ నికోలస్ (7)లను పెవిలియన్ పంపాడు. టిమ్ సౌథీ (21), నీల్ వాగ్నెర్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసి భారత్ కంటే 15 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Updated Date - 2021-06-23T02:07:02+05:30 IST