కొత్తగా 13,618 కరోనా కేసులు... 9 మంది మృతి
ABN , First Publish Date - 2022-01-27T07:51:27+05:30 IST
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,143 శాంపిల్స్ను పరీక్షించగా
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,143 శాంపిల్స్ను పరీక్షించగా 13,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. తాజాగా విశాఖపట్నంలో 1,791 కేసులు బయటపడగా.. అనంతపురంలో 1,650, గుంటూరులో 1,464, కర్నూలులో 1,409, ప్రకాశంలో 1,295, నెల్లూరులో 1,007 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 22,22,573కి చేరుకుంది. కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాలు 14,570కి పెరిగాయి.