భారత పర్యటనకు కివీస్-ఎ నెలాఖరులో మ్యాచ్‌లు

ABN , First Publish Date - 2022-08-17T10:06:52+05:30 IST

దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత భారత్‌-ఎ జట్టు మళ్లీ బరిలోకి దిగనుంది.

భారత పర్యటనకు కివీస్-ఎ  నెలాఖరులో మ్యాచ్‌లు

న్యూఢిల్లీ: దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత భారత్‌-ఎ జట్టు మళ్లీ బరిలోకి దిగనుంది. ఈ నెలాఖరులో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌-ఎతో మూడు అనధికార టెస్టులు, మూడు లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో ఒక మ్యాచ్‌ను డే/నైట్‌ (పింక్‌ బాల్‌ టెస్ట్‌)గా నిర్వహించే అవకాశముంది. ఈ సిరీస్‌ తర్వాత ఆస్ట్రేలియాతోనూ భారత్‌-ఎ తలపడనుంది. గతేడాది నవంబరు-డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్‌-ఎ ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. కాగా, కివీ్‌సతో సిరీ్‌సకు వచ్చేనెల 8-25 మధ్య జరిగే దులీఫ్‌ ట్రోఫీ మ్యాచ్‌లు అడ్డుతగిలే అవకాశాలున్నాయి. రంజీ ట్రోఫీ ముందు నవంబరు-డిసెంబరులో ఆస్ట్రేలియాతో సిరీ్‌సను నిర్వహించాలని కూడా బీసీసీఐ యత్నిస్తోంది. 

Updated Date - 2022-08-17T10:06:52+05:30 IST