సిరీస్ పట్టేసిన న్యూజిలాండ్
ABN , First Publish Date - 2022-08-14T08:59:09+05:30 IST
వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీ్సను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది.
కింగ్స్టన్: వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీ్సను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20లో కివీస్ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (76), డారిల్ మిచెల్ (48) రాణించడంతో 20 ఓవర్లలో పర్యాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో శాంట్నర్, బ్రేస్వెల్ చెరో మూడు వికెట్లు తీశారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ గ్లెన్ ఫిలి్ప్సకు దక్కింది. సోమవారం ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది.