రాత్రి 11 గంటలకల్లా కొత్త వేతనాలు?

ABN , First Publish Date - 2022-02-02T02:34:40+05:30 IST

రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగులందరికి కొత్త పీఆర్సీ ప్రకారం

రాత్రి 11 గంటలకల్లా కొత్త వేతనాలు?

అమరావతి: రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగులందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే అవకాశం ఉంది. పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చని సీఎస్‌ సమీర్ శర్మ అన్నారు. వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. చలో విజయవాడతో పాటు సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరోసారి చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు.


 ఉద్యోగులు సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని సీఎస్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-02T02:34:40+05:30 IST