ఏపీలో కొత్తగా 2,949 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-29T01:58:42+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,949 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 2,949 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,949 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఏపీలో 8,14,774కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 18 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో 6,643 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 26,622 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి 7,81,509 మంది డిశ్చార్జ్ అయ్యారు.


గడిచిన 24 గంటల్లో అనంతపురం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు.


Updated Date - 2020-10-29T01:58:42+05:30 IST