మాదాపూర్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2021-06-30T00:19:58+05:30 IST

మాదాపూర్ పీఎస్‌ పరిధిలోని ఇనార్బిట్‌ మాల్‌ ఎదుట కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు

మాదాపూర్  కారు ప్రమాదం కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌:  మాదాపూర్ పీఎస్‌ పరిధిలోని ఇనార్బిట్‌ మాల్‌ ఎదుట కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సుజిత్‌రెడ్డి, ఆశిష్ మద్యం మత్తులో ప్రమాదం చేశారని నిర్దారణ అయింది. అయితే వేరే వ్యక్తి డ్రైవ్‌ చేశాడని సుజిత్ తండ్రి రఘునందన్‌రెడ్డి డ్రామా ఆడాడు. ప్రమాదం జరిగిన తరువాత కొడుకు సుజిత్‌ను నల్లకుంటలో రహస్య ప్రాంతంతో తండ్రి రఘునందన్‌రెడ్డి దాచిపెట్టాడు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన సుజిత్ తండ్రి రఘునందన్‌రెడ్డిని కూడా నిందితుల్లో మాదాపూర్ పోలీసులు చేర్చారు. 




మాదాపూర్‌లోని మైహోం అబ్రా అపార్ట్‌మెంట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆడి కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-06-30T00:19:58+05:30 IST