నెల్లూరు పోలింగ్ కేంద్రంలో విషాదం
ABN , First Publish Date - 2021-04-17T13:40:29+05:30 IST
జిల్లాలోని చిట్టమూరు మండలంలోని అరవపాళెం పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలోని అరవపాళెం పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి రవి మృతి చెందారు. చాతిలో నొప్పి రావడంతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి అధికారులు ఆస్పత్రి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సూళ్లూరుపేట మండంలోని నూకలపాలెంలో ఉపాధ్యాయుడిగా రవి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.