ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన విద్యుత్తీగ
ABN , First Publish Date - 2020-10-18T08:55:15+05:30 IST
ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన విద్యుత్తీగ
నెల్లూరు రూరల్, అక్టోబరు 17: విద్యుత్ తీగ తెగిపడి ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కల్లూరిపల్లి హౌసింగ్బోర్డు కాలనీలో నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోవిందు వేణుగోపాల్(55) కొరియర్ బాయ్ నుంచి పార్సిల్ తీసుకుని నగదు ఇస్తుండగా పైనున్న 11కేవీ విద్యుత్ తీగ తెగి ఆయనపై పడింది. ఆయన షాక్కు గురవడంతో తల్లిబుజ్జమ్మ(75) కుమారుడిని కాపాడేందుకు వచ్చి పట్టుకోగా ఆమెకూ కరెంట్ షాక్ తగిలింది. వీరిని కాపాడేందుకు వేణుగోపాల్ భార్య హేమలత(50) కర్రతో తీగను తొలగించేందుకు యత్నించగా ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.