Alert: గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-12-02T15:34:29+05:30 IST
పరీక్షకు..
నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టీఎస్ఈ) పరీక్షకు గడువును డిసెంబర్ 16 వరకు పెంచినట్టు ఏపీ ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్టీఎస్ఈ మొదటి స్టేజ్ పరీక్షను 2022 జనవరి 23 నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
పరీక్ష ఫీజు రూ.200ని ఎన్టీఎస్ఈ పేమెంట్ ట్యాబ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. జిల్లా విద్యాశాఖ కార్యాలయం/ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం లేదంటే కింది వెబ్సైట్ నుంచి మరిన్ని వివరాలను పొందవచ్చు.
వెబ్సైట్: www.bse.ap.gov.in