జాతీయ రహదారిపై ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-11T22:08:08+05:30 IST
జిల్లా కోదాడ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్వారకుంట సమీపంలో 65వ జాతీయ రహదారిపై ..
సూర్యాపేట: జిల్లా కోదాడ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్వారకుంట సమీపంలో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతు దేహన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.