జగన్ చర్య.. వైఎస్ఆర్‌కు వెన్నుపోటు పొడవటమే: తులసి రెడ్డి

ABN , First Publish Date - 2020-02-19T20:28:45+05:30 IST

శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో చేసిన తీర్మానం.. వైఎస్ఆర్‌కు వెన్నుపోటు పొడవటమే అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. కక్షపూరితంగా అహంభావంతో మండలిని రద్దు చేస్తూ తీర్మానం

జగన్ చర్య.. వైఎస్ఆర్‌కు వెన్నుపోటు పొడవటమే: తులసి రెడ్డి

అమరావతి: శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో చేసిన తీర్మానం.. వైఎస్ఆర్‌కు వెన్నుపోటు పొడవటమే అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. కక్షపూరితంగా అహంభావంతో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారని విమర్శించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో, రాష్ట్రంలో గాంధేయవాదానికి, గాడ్సేవాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు. సైద్ధాంతిక పోరాటంలో అంతిమ విజయం గాంధేయవాదానిదే అని చెప్పుకొచ్చారు. ఏపీకి బీజేపీ చేసిన మోసం, ద్రోహం మరో పార్టీ చేయలేదన్నారు. ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టారని, విభజన హామీలు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై తులసి రెడ్డి ఫైర్ అయ్యారు.

Updated Date - 2020-02-19T20:28:45+05:30 IST