తాడేపల్లిలో ముగిసిన నారీ సంకల్ప దీక్ష

ABN , First Publish Date - 2022-02-01T00:18:06+05:30 IST

తాడేపల్లిలో ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ఆధ్యర్యంలో నిర్వహించిన

తాడేపల్లిలో ముగిసిన నారీ సంకల్ప దీక్ష

అమరావతి: తాడేపల్లిలో ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ఆధ్యర్యంలో నిర్వహించిన నారీ సంకల్ప దీక్ష ముగిసింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. గీతకు నిమ్మ రసం ఇచ్చి దీక్షను ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర విరమింపచేశారు. ఈ దీక్షకు తెలంగాణా రాష్ట్రం నుంచి కూడా  మహిళలు తరలివచ్చారు. దీక్షలో‌ పాల్గొని బోండా ఉమా, పట్టాభి, పత్తిపాటి పుల్లారావు, ఎంఎస్ రాజు, వర్లరామయ్య, కొల్లు రవీంద్ర ప్రసంగించారు. 


న్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం నారీ సంకల్ప దీక్ష సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో దీక్ష మొదలైంది. మహిళలపై అఘాయిత్యాలు, మద్యపాన నిషేధం పై మాట తప్పటం, నిత్యావసరాల ధరలు పెంపు, మహిళా సాధికారత సంఘాల నిర్వీర్యం అంశాలకు నిరసనగా 'టీడీపీ నారీ సంకల్ప దీక్ష' చేపట్టారు. తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు నిరసన దీక్షలో కూర్చున్నారు. 

Updated Date - 2022-02-01T00:18:06+05:30 IST