నరేశ్, హర్మిలన్ రికార్డు ప్రదర్శన
ABN , First Publish Date - 2021-09-17T07:24:28+05:30 IST
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్లో వరుసగా రెండోరోజూ రికార్డుల హోరు కొనసాగింది.
హనుమకొండ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్లో వరుసగా రెండోరోజూ రికార్డుల హోరు కొనసాగింది. గురువారం ఇక్కడ జరిగిన పోటీల్లో పంజాబ్కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్ కౌర్ మహిళల 1500 మీటర్ల రేసును రికార్డు టైమింగ్తో గెలుచుకుంది. హర్మిలన్ 4:05.39 సెకన్లలో రేసును ముగించి 19 ఏళ్ల క్రితం బుసాన్ ఆసియా క్రీడల్లో సునీతా రాణి (4:06.03) నెలకొల్పిన రికార్డును బద్ధలుకొట్టింది. ఇక, పురుషుల 100 మీటర్ల రేసును ఆంధ్రప్రదేశ్ కుర్రాడు నరేశ్ కుమార్ నెగ్గాడు.
గుంటూరుకు చెందిన నరేశ్ 10.36 సెకన్ల టైమింగ్తో స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 2001లో అనిల్ కుమార్ పేరిటనున్న 10.37 సెకన్ల టైమింగ్ను అధిగమించి సరికొత్త మీట్ రికార్డును నమోదుచేశాడు. అంతేకాదు.. ఈ ప్రదర్శనతో నరేశ్ భారత్లోని ఐదుగురు ఫాస్టెస్ట్ స్ర్పింటర్లలో ఒకడిగా నిలవడం విశేషం.