Narayanadri రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు
ABN , First Publish Date - 2022-06-16T14:50:54+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు.
పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో నరేంద్ర అనే వ్యక్తి ట్రాక్పై జారిపడ్డాడు. దీంతో నరేంద్ర కాలు సగానికి విరిగిపోయింది. వెంటనే ప్రయాణికుడిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర హైదరాబాద్ నుంచి నరసరావుపేట వెళ్తున్నట్లు తెలుస్తోంది.