నరసరావుపేట జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-05-28T23:28:24+05:30 IST
నరసరావుపేట జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి కార్యకర్తలను..
పల్నాడు జిల్లా: నరసరావుపేట జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు పోనివ్వమని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నరసరావుపేటలో వైసీపీ మంత్రుల సభ జరగనుంది. ఈ సభలో నల్లజెండాలతో మంత్రులకు నిరసన తెలపాలని జనసేన పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నరసరావుపేటలో జనసేన కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కార్యకర్తలను బయటకు రాకుండా చూస్తున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమను కార్యాలయం నుంచి బయటకు వదిలి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.