ఆ వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి: లోకేష్

ABN , First Publish Date - 2020-04-10T18:19:08+05:30 IST

అమరావతి: లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలు అల్లాడుతున్నారని.. అటువంటి వారిని లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు మరింత ఆందోళనకు..

ఆ వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి: లోకేష్

అమరావతి: లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలు అల్లాడుతున్నారని.. అటువంటి వారిని లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సీఎం జగన్ రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ‘‘లాక్‌డౌన్‌తో పేద ప్రజలు అల్లాడుతున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి. పనులు లేవు, తినడానికి తిండి లేదు, ఎక్కడకి కదలలేని పరిస్థితి. అప్పు పుట్టే అవకాశం కూడా లేదు. సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను జగన్ గారు ఆదుకోవాలి. 


తక్షణమే 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నాను. రైతుల కష్టాలు వర్ణనాతీతం. మద్దతు ధర లేదు.. రవాణా సౌకర్యం లేదు.. లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు. అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. లాక్‌డౌన్, అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వెయ్యాలి. రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపాలి’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.




Updated Date - 2020-04-10T18:19:08+05:30 IST