దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన ధన్యజీవి డాలర్ శేషాద్రి : నారా లోకేష్

ABN , First Publish Date - 2021-11-29T15:36:45+05:30 IST

డాలర్ శేషాద్రి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన ధన్యజీవి డాలర్ శేషాద్రి : నారా లోకేష్

అమరావతి: డాలర్ శేషాద్రి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన ధన్యజీవి అని లోకేష్ కొనియాడారు. ‘‘టీటీడీ‎ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరిస్తూ, ఆయన పాదపద్మాల చెంతనే ఉన్న శేషాద్రి గారు ధన్యజీవి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.


Updated Date - 2021-11-29T15:36:45+05:30 IST