ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా?: లోకేష్

ABN , First Publish Date - 2020-10-30T17:52:07+05:30 IST

తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయని..

ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా?: లోకేష్

అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, 70 శాతం పనులు పూర్తి అయితే నేను మీసాలు తీసేస్తానని.. లేదంటే దేవినేని ఉమ మీసాలు తీయాలని’’ ఓ మంత్రి సవాల్ విసిరారని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై మంత్రి, సీఎం జగన్ రివ్యూ సమావేశంలో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులే చెప్పారన్నారు. ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - 2020-10-30T17:52:07+05:30 IST