కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్

ABN , First Publish Date - 2021-02-25T17:39:44+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్

కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గొల్లమందలలో వైసీపీ గూండాల దాడిలో హత్యకు గురైన సోమయ్య కుటుంబాన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పరామర్శించారు. ముందుగా మాజీ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య ఇంటికి వచ్చి ఆమెను పరామర్శించారు. సౌమ్యపై ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దానికి సంబంధించిన వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు.


అలాగే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వారిని కూడా లోకేష్ పరామర్శించనున్నారు. గొల్లమందలలో టీడీపీ నేత సోమయ్యపై కూడా వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. దీంతో సోమయ్య కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోందన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం, వారిపై దాడులు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. ఇక సీఎం ఆటలు చెల్లవని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభలకు గురిచేసినా, ఎన్ని ఇబ్బందులకు పెట్టినా.. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందని మహిళలు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-25T17:39:44+05:30 IST