అంబేడ్కర్ ఇంటిపై దాడికి లోకేశ్ ఖండన
ABN , First Publish Date - 2020-07-11T08:37:44+05:30 IST
అంబేడ్కర్ ఇంటిపై దాడికి లోకేశ్ ఖండన
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇల్లు ‘రాజ్ గృహ’పై దుండగుల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని అన్నారు. దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.