మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు: నన్నూరి నర్శిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-28T23:51:43+05:30 IST

మహానాడు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి వ్యగ్యస్త్రాలు సంధించారు.

మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు: నన్నూరి నర్శిరెడ్డి

ఒంగోలు: మహానాడు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి వ్యగ్యస్త్రాలు సంధించారు. ‘‘మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.మాకో తిక్కడు.. మీకో పిచ్చొడు తగులుకున్నారు.తెలంగాణలో దొరల పాలన.. ఏపీలో దొంగల పాలన.మాకు సెక్రటేరీయేట్ లేదు.. మీకు రాజధాని లేదు.మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.కేసీఆర్ కన్పిస్తే బ్రేకింగ్ న్యూస్.. జగన్ తెలుగు మాట్లాడితే షాకింగ్ న్యూస్.తెలుగుదేశం జెండాని ప్రతి ఒక్కరు బలపర్చాల్సిన అవసరం ఉంది’’ అని  నర్శిరెడ్డి అన్నారు..



Updated Date - 2022-05-28T23:51:43+05:30 IST